ఏపీ ప్రభుత్వం స్వామిత్వ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వామిత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వారి ఆస్తులపై యాజమాన్య హక్కులు కల్పిస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. వచ్చే మార్చి నాటికి కోటి మందికి స్వామిత్వ పథకం కింద ప్రాపర్టీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే వేగంగా పూర్తి చేసేందుకు గ్రామ సర్వేయర్ల సహకారం తీసుకోవాలని సూచించారు.