విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ముగింపు ఉత్సవాలు సోమవారం జరిగాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన ఈ ముగింపు వేడుకలకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువతకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. తాను కూడా సాధారణ కుటుంబం నుంచే వచ్చానని, కఠోర సాధనతో లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన అన్నారు. అనుమానాలు, అపోహలను అధిగమించినప్పుడే ముందు వెళ్లగలమని సచిన్ యువతకు సూచించారు.