రాష్ట్రంలో మహిళలు, బాలికల సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా శక్తి బృందాలను రంగంలోకి దించింది. రాష్ట్రవ్యాప్తంగా శక్తి బృందాలు పనిచేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్తో పాటుగా సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపులు.. ఇలా ఇబ్బంది పెట్టే ఏ అంశమైనా మహిళలు శక్తి బృందాలను ఆశ్రయించవచ్చు. ఇందుకోసం 112 నంబరుతో పాటుగా శక్తి యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే ఏలూరు పోలీసులు ఓ ఈవ్ టీజర్ పనిపట్టారు.