Mahabubnagar Old Railway Building Demolished: మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ పాత భవనం కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. గత 32 ఏళ్లుగా ప్రయాణికులకు సేవలందించిన ఈ బిల్డింగ్ని కూల్చి వేసి.. దాని స్థానంలో కొత్తది నిర్మించనున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద మహబూబ్నగర్ ఎంపిక కావడంతో ఈ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. తాత్కాలిక కౌంటర్లలో సేవలు అందుబాటులో ఉంటాయని, కొత్త నిర్మాణం 8 నెలల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు దీన్ని గమనించాలని కోరారు.