ఏసీబీ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలు, ఆఫీసులపై ఏసీబీ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్ల విలువైన అక్రమాస్తులతో పాటు భారీగా నగదు, బంగారాన్ని అధికారులు గుర్తించారు.