రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోంది. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లాలో ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో సోదాల్లో రూ.100 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఉన్నతాధికారుల అవినీతిపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటోంది.