రాష్ట్రంలోని ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న రాయితీలు, ప్రోత్సాహకాలను విడుదల చేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు పెండింగ్లో ఉన్న రాయితీల్లో రూ. 125 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ. 60 కోట్లు ఐటీ పరిశ్రమలకు చెందినవే కావడం గమనార్హం. అయితే వీటి పట్ల గత ప్రభుత్వం అలసత్వం వహించిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. తమ నిర్ణయంతో కంపెనీలకు ఊరట కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కాగా దీని వల్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది.. కంపెనీల్లో విశ్వాసం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.