హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రయాణాలు చేసే వారికి టీజీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల కోసం ఆరు ఏసీ బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. మండు వేసవిలో చల్లని ప్రయాణం అందించేందుకు గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు రూట్ల వివరాలు వెల్లడించారు.