టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ నిర్మాణ సంస్థకు చెందిన యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, మ్యాంగో మీడియా సంస్థకు చెందిన వారి నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు గత మంగళవారం నుంచి సోదాలు ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ సోదాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. దిల్ రాజును జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి సాగర్ సొసైటీలో ఉన్న ఎస్వీ క్రియేషన్స్ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లి కీలక వివరాలపై ఆరా తీశారు.