రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. రైతుల పెట్టుబడి మొదలుకొని పంట విక్రయాల వరకూ మద్దతుగా నిలుస్తోంది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల కోసం కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశువుల షెడ్లను మంజూరు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. గుంటూరు జిల్లాకు 256 పశువుల షెడ్లను మంజూరు చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. లబ్ధిదారులకు రెండు లక్షల రూపాయలు పశువుల షెడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించనుంది.