మెరుగైన జీవితం కోసం బహ్రెయిన్ వెళ్లిన జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీపాద నరేశ్ (40) ఐదేళ్ల క్రితమే మరణించినట్లు కుటుంబ సభ్యులకు తాజాగా తెలిసింది. 2018 నుంచి ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబానికి, ఆయన మృతదేహం బహ్రెయిన్ మార్చురీలో ఐదేళ్లుగా ఉందని తెలియడంతో తీరని విషాదం మిగిలింది.