ఐదో తరగతి చదువుతున్న బాలికపై.. ఇదేం పని రా నాయనా..

9 months ago 26
రెండేళ్లుగా పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ఓ నిందితుడు ఊహించని రీతిలో పట్టుబడ్డాడు. అతన్ని పట్టించింది మరెవరో కాదు, స్వయంగా అతని అమ్మమ్మే. 2023 మే నెలలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు లక్కీ అలియాస్ రాబిన్సన్ (25) అనే క్యాటరింగ్ బాయ్‌పై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాబిన్సన్ మాయమాటలు చెప్పి బాలికను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి విశాఖపట్నం తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఒరిస్సాకు కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న రాబిన్సన్ రెండు రోజుల తర్వాత బాలికను హైదరాబాద్‌లో వదిలేసి పరారయ్యాడు. అప్పటినుండి పోలీసులు ఎంత ప్రయత్నించినా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా, రాబిన్సన్ అమ్మమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన రాబిన్సన్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్, డిఐ, టీం చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేశారు. రాబిన్సన్‌పై పోక్సో (POCSO) కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. సినిమాను తలపించే ఈ ట్విస్ట్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article