ఐపీఎల్ మెగా వేలం. జెడ్డా వేదికగా ఆటగాళ్లను కొనుక్కునేందుకు, కోట్లు వెదజల్లేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. ఎవరు జాక్పాట్ కొడతారు.. ఎవరు ఆశ్చర్యపరుస్తారు.. ఎవరు నిరాశచెందుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆది, సోమవారాల్లో జరిగే మెగా వేలంలోపది ఫ్రాంఛైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీపడనున్నాయి. వీరిలో భారత క్రికెటర్లు 367 మంది ఉండగా..తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ఉన్నారు. మొదటిసారి చిత్తూరు జిల్లా యువకుడి పేరు ఈ వేలంలో నమోదయ్యింది.