ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో మరోసారి మాజీ మంత్రి బాలినేని, ఎమ్మెల్యే దామచర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తనను, తన అనుచరులను టార్గెట్ చేస్తున్నారంటూ బాలినేని ఆరోపిస్తే.. అసలు బాలినేని చేసిన దానికి జనసేనలో లేకుంటే ఎప్పుడో జైలుకు వెళ్లేవారని దామచర్ల అన్నారు. కూటమిలో ఉన్నారనే మౌనంగా ఉంటున్నానని దామచర్ల అంటే.. ఎమ్మెల్యే అయితే ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ బాలినేని హెచ్చరించారు. మొత్తానికి బాలినేని వర్సెస్ దామచర్ల వ్యవహారంతో ఒంగోలు మరోసారి హీటెక్కింది.