ఒంటరి మహిళకు మాయ మాటలు చెప్పి.. ఆస్తి మొత్తం స్వాహా.. చివరకు..

4 months ago 7
అత్యాశకు పోయి మేనత్త ఆస్తి కాజేశారు ఇద్దరు అల్లుళ్లు. భర్త పోయి ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలికి పింఛను ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. అనంతరం ఆమెకు అనుమానం రాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి.. భూమిని తమ పేరుపై రాయించుకున్నారు. చివరికి లోన్ కోసం భూమి వివరాలను తీయించుకున్న బాధితురాలు.. అసలు విషయం తెలుసుకుని కుంగిపోయింది. ఇందతా చేసింది తన మేనల్లుళ్లే అని తెలిసి మనోవేదనకు గురైంది. చివరకు గ్రామస్థుల సహకారంతో పోలీసుల దృష్టికి ఈ విషయం వెళ్లింది. తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు అధికారులను వేడుకుంటోంది.
Read Entire Article