ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ ఐదో తేదీవ వరకూ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాల వరకూ ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.