దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమిని జరుపుకోనున్నారు. ఈ క్రమంలోనే ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.