కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫోటోను రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, పోలీసుల నోటీసులకు ఏమాత్రం బెదరకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె తన ట్వీట్ను తొలగించకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు చేస్తూ తగ్గేదేలే అన్న సంకేతాన్ని ఇస్తున్నారు. ఈ వ్యవహారం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.