జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.. కేటీఆర్, హరీష్ రావులపై తీవ్రంగా మండిపడ్డారు. వరుస ఓటముల తర్వాత కూడా వారు అసూయ, అహంకారం తగ్గించుకోవాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ కనిపించకుండా పోవడం ఖాయమన్నారు. ఈ విజయం తమ బాధ్యతను పెంచిందని, హైదరాబాద్పై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని సీఎం తెలిపారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకుని, అభివృద్ధికి సహకరించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని.. ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు.