తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం అధికారులు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అక్కడక్కడ అవకతవకలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఒకే కుటుంబానికి ఐదు ఇళ్లు మంజూరు కావడం వివాదాస్పదమైంది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనర్హులకు ఇళ్లు మంజూరు కావడంతో 1950 ఇళ్లను అధికారులు రద్దు చేసిన సంగతి తెలిసిందే.