హైదరాబాద్లో కో-లివింగ్ కల్చర్ మాటున డ్రగ్స్ దందా విస్తరిస్తోంది. గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలోని కో-లివింగ్ రూమ్స్లో దాడులు నిర్వహించిన పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో నైజీరియన్, గుత్తా తేజ వంటి సరఫరాదారులు ఉన్నారు. మరోవైపు.. ముషీరాబాద్లో అద్దెకు ఉంటున్న జాన్పాల్ అనే వైద్యుడి ఇంట్లో కూడా రూ. 3 లక్షల విలువ చేసే కొకైన్, హాష్ ఆయిల్ వంటి డ్రగ్స్ను పట్టుకున్నారు. నిందితులు ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి.. యువతకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.