తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర దృశ్యం. చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంపై చంద్రబాబు అభినందనలు తెలిపారు.