సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో యువత ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్లో జరిగింది. ఒకే బైక్పై ఎనిమిది మంది యువకులు ప్రయాణిస్తూ హల్ చల్ చేశారు. వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. బైక్ నంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమతో పాటు పక్కవారినీ ప్రమాదంలో పడేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.