ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకటే మాటపై నిలబడ్డారు. రాజకీయంగా బద్ధశత్రువులు అయిన వీరిద్దరూ ఒకే నిర్ణయాన్ని స్వాగతించారు. వచ్చే జనగణనతో పాటుగా కులగణన కూడా చేపట్టాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుతున్న నిర్ణయాన్ని చంద్రబాబు, వైఎస్ జగన్ స్వాగతించారు. కులగణనపై కేంద్రం నిర్ణయం హర్షణీయమని.. వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు.