రేషన్ పంపిణీకి సంబంధించి.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ప్రధాన కారణం.. గత సీజన్లకు సంబంధించిన రేషన్ బియ్యం నిల్వలు పెరిగిపోవడంతో ఆ స్టాక్ను ఖాళీ చేసేందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ సీజన్ బియ్యం కూడా రానుండటంతో.. ఆలోగా ఉన్న నిల్వలను రేషన్ కార్డు దారులకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.