తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఫైరయ్యారు. తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ యూనిట్ను ఏపీకి తరలించారని మండిపడ్డారు. అవసరమైన భూమి, మౌళిక సదుపాయాలు కల్పించినా.. రాష్ట్రానికి మెుండిచేయి చూపారన్నారు. ఏపీలో ఒక్క ఎకరం భూకేటాయింపులు జరగకుండానే ప్రాజెక్టును కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.