ప్రయాణికులకు ప్రయాణ అనుభవం మెరుగుపరిచేందుకు ఆర్టీసీ పలు విధానాలు తీసుకొస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహిస్తున్న గమ్యం యాప్లో కొత్త ఫీచర్ తీసుకొచ్చంది. ప్రత్యేకంగా మహిళల భద్రత కోసం ఉద్దేశించిన.. ఫ్లాగ్ ఏ బస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం మొబైల్ ఫోన్తో ఉన్నచోటే బస్సును ఆపొచ్చు. అయితే సదుపాయం కేవలం రాత్రి 7 నుంచి ఉదయం 5 గంటల మధ్య మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్ కదుపుతూ కనిపిస్తే.. వెంటనే డ్రైవర్లు ప్రయాణికులను గుర్తించి బస్సును ఆపుతారు.