ఒక్క డీల్‌కే అన్ని కోట్ల లంచమా.. జగన్‌పై షర్మిల విమర్శలు

1 year ago 17
అదానీ లంచం, మోసం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాటా ఉందని కొన్ని మీడియాల్లో వస్తోన్న ఆరోపణలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వల్ల రాష్ట్ర పరువు పోయిందని ఆరోపించారు. పవర్ ప్లాంట్ ఏర్పాటుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖంగా లేకపోతే.. గౌతమ్ అదానీ రూ.1,750 కోట్లు లంచంగా ఇచ్చారని స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు. అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయటపెడితే తప్పా.. మన దేశం, మన రాష్ట్రంలో ఇది జరుగుతుందని బయటపడలేదంటే ఎంత అవమానకరం.. సీబీఐ, ఈడీ, సెబీ, ఐటీ ఏం చేస్తున్నాయి.. వీళ్లు బయటపెట్టలేని విషయాలు అమెరికాలోని వాళ్లు బయపెట్టారంటే దేశంలో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగడం ఎంత అవమానకరం అన్నారు. జగన్‌ తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు.
Read Entire Article