తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్నదాతల కోసం ఈ ప్రకటన. రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగష్టు 13 చివరి తేదీ. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే రూ.5 లక్షల నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు, గతంలో చేరని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని.. అర్హులైన వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. ఆ వివరాలు.