మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం జువ్విగూడ గ్రామం అరుదైనదిగా నిలిచింది. ఒకప్పుడు 250 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఇప్పుడు కేవలం ఒకే ఇల్లు, అందులో 89 ఏళ్ల రాంబాయి, ఆమె కుమారుడు అనంతి మాత్రమే నివసిస్తున్నారు. సౌకర్యాలు లేకపోయినా, మట్టిపై మమకారంతో ఈ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.