ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్ అయిన వారికి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. 2020 జనవరి ఒకటి తర్వాత రిటైర్ అయినవారికి.. అలాగే ఇక ముందు పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తింపజేయనున్నారు. వీరికి ఈహెచ్ఎస్ స్కీమ్ కింద వైద్య సౌకర్యాలు అందించాలని.. వారి భాగస్వామ్యులకు కూడా ఉచిత వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.