యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్లో ఎల్లో ఫీవర్ టీకా కేంద్రం ప్రారంభమైంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి నివారణకు ఒకసారి టీకా వేసుకుంటే జీవితకాలం రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం 42 దేశాలు ఈ టీకాను తప్పనిసరి చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత బీబీనగర్లో ప్రతి సోమవారం టీకా అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాల్సి ఉంటుంది.