నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వారు ఆర్థికంగా స్థిరపడే విధంగా చేయటం కోసం లోన్లు మంజూరు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలు రెడీ చేస్తోంది. త్వరలోనే అర్హుల ఎంపిక, లోన్లు మంజూరు ఉంటుందని అధికారులు చెప్పారు.