Mahabubabad Farmers Get Compensation From Seeds Company: నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. నకిలీ విత్తనాలు అమ్మినందుకు ఒక్కో రైతుకు రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2017లో చేసిన ఫిర్యాదుపై తాజాగా తీర్పు ఇచ్చారు. మహబూబాబాద్ రైతులు దాదాపు తొమ్మిదేళ్ల పాటూ పోరాటం చేసి పరిహారాన్ని సాధించారు. రైతులు ఒక్కొక్కరికి రూ.2 లక్షలతో పాటుగా మరో రూ.10వేలు కేసు ఖర్చుల కింద ఇవ్వాలని ఆ కంపెనీని ఆదేశించారు.