హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో దివంగత నేత మాగంటి గోపీనాథ్ కుమార్తెలు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉండగా.. మరొకరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని ఆస్పత్రికి తరలించారు. ముందు వెళ్తున్న డీసీఎంను వీరు వెళ్తున్న కారు వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.