ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్ర సుమారు 2 గంటలపాటు వాదనలు వినిపించారు. 2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టం వర్తించదని.. ఎఫ్ఐఆర్, జనరల్ డైరీ నమోదు లేకుండానే ట్రాప్ చేశారని వాదించారు.