హైదరాబాద్లో ఓయో హోటల్ అడ్డాగా చేసుకుని గంజాయి ముఠా తమ దందా సాగిస్తోంది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ హోటల్పై దాడి చేసి ఇద్దర్ని అరెస్ట్ చేశారు. గంజాయిని అస్సాం నుంచి తీసుకొచ్చి హోటల్ గదిలో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.9 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి విక్రయాలకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.