రేవంత్ రెడ్డి సర్కార్ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థల ఆందోళనలపై నిషేదం విధించటంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఓయూలో విద్యార్థుల ఆందోళనలు నిషేధించటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోకపోతే.. నియంత పాలనకు గుణపాఠం తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.