నిజామాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సొంత అత్తగారింట్లోనే అల్లుడు తన పనితనం చూపించాడు. ఏమవసరం వచ్చిందో కానీ.. సొంత అత్తగారింట్లోనే చోరీకి పాల్పడ్డాడు. అత్త ఊరు వెళ్లిన విషయాన్ని గమనించిన అల్లుడు.. ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో దాచుకున్న 8 తులాల బంగారాన్ని దోచుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రోటరీ నగర్లో జరిగింది.