గంభీరమైన వ్యక్తిత్వానికి మారుపేరైన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాదాపూర్లోని గోపినాథ్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఆయన పార్థివదేహాన్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. భావోద్వేగంతో గోపినాథ్ కుమారుడిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు.