కంపెనీల లాభాపేక్షతో.. గాల్లో దీపాలుగా కార్మికుల బతుకులు.. ఈ చావులకు బాధ్యులెవరు..?

8 months ago 11
లాభాపేక్షతో కూడిన ఈ ప్రపంచంలో కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 40 మంది మృతి చెందడం పరిస్థితికి అద్దం పడుతోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రభుత్వాలు, పరిశ్రమలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని పాశమైలారం ప్రమాదం నిరూపిస్తోంది. ప్రతి ప్రమాదం జరిగిన తర్వాత హడావిడి షరా మామూలే అయిపోయింది. మరో దుర్ఘటన జరిగే వరకు.. మళ్లీ ఆ ఊసు కూడా ఎత్తరు. ఈ క్రమంలో ఫ్యాక్టరీల్లో వరుసగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? కార్మికులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడంలో పరిశ్రమలు ఏ మేరకు బాధ్యత వహిస్తున్నాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Read Entire Article