రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు, అక్కడ రాజకీయాలతో పాటు తనపై ప్రత్యర్థులు చేస్తోన్న విమర్శలకు పవన్ స్పందించారు. పక్క రాష్ట్రాల్లో నాయకులతో తనను పోల్చుతున్నారని, తమిళనాడులో రాజకీయాలు చాలా సాఫీగా ఉంటాయని అన్నారు. ఇదే సమయంలో ఇటీవల అమిత్ షాను కలిసినప్పుడు తాను జగన్ను అరెస్ట్ చేయమని కోరినట్టు జరిగిన ప్రచారంపై మండిపడ్డారు.