వైఎస్సార్ కడప జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. మైదుకూరు మండలం విశ్వనాథపురంలో ఓ వ్యక్తి తన పూరి గుడిసెను శుభ్రం చేస్తున్న సమయంలో.. పురాతన వస్తువులు బయటపడ్డాయి. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన పూరి గుడిసెలోని గచ్చును శుభ్రం చేస్తుండగా.. ఆంగ్లేయుల కాలం నాటివిగా చెప్తున్న 12 టోలాస్, పిడిబాకు లభ్యమయ్యాయి. స్థానిక చరిత్రకారుడు వీటిని పరిశీలించి.. ఆంగ్లేయుల కాలం నాటివిగా గుర్తించారు.