కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన పంధ్రాగస్టు వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. వేడుకలకు వెళ్లిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి.. తనకు వేదికపై కుర్చీ వేయలేదని ఆమె అలిగి వెళ్లిపోవడంతో వివాదం మొదలైంది. ఇదే సమయంలో అధికారులు.. ఆమెకు కుర్చీ వేసి కూర్చోమని ఆహ్వానించినా రాలేదు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఎమ్మెల్యే రాకపై తమకు ఎటువంటి సమాచారం అదేని, అందుకే వీఐపీలకు కేటాయించిన సీట్లో ఇతరులు కూర్చున్నారని తెలిపారు.