కడప సమస్య చెప్పిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. డిప్యూటీ స్పీకర్ రఘురామ ఏమన్నారంటే

1 year ago 25
కడపలో తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా ఏపీకి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించినా సమస్య పరిష్కారమవలేదని తెలిపారు. శాసనసభలో బడ్జెట్‌ చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘ఆర్వో ప్లాంట్ల నుంచి వచ్చే వృథానీటిని అవసరాలకు వాడుకోవాల్సి వస్తోంది. నగరానికి ఒక్క సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు లేదు. వైకాపా నేతలు పాఠశాలలను మూయించి వాటర్‌ప్లాంట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. పెన్నాలో మురుగునీరు కలుస్తుండడంతో నల్లాల పైపుల్లోకి వస్తోంది. కడపకు మంచినీటి కోసం లింగపల్లిలో చెక్‌డ్యాం కట్టాలని, సోమశిల వెనుక జలాల నుంచి తీసుకోవాలనే ప్రతిపాదనలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. తాగడానికి మంచినీళ్లు ఇవ్వమని కడప ప్రజల తరఫున కోరుతున్నాను అన్నారు. ఈ ప్రశ్నను నోట్ చేసుకున్నామని సమస్యను పరిష్కరిస్తామన్నారు మంత్రి.
Read Entire Article