ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ కిచెన్ విధానంపై నీతిఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ఎక్స్ వేదికగా కడప స్మార్ట్ కిచెన్ పనితీరును వివరిస్తూ నీతి ఆయోగ్ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ నీతిఆయోగ్కు ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం, సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇక స్మార్ట్ కిచెన్ల ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.