కడప జిల్లా నందలూరు మండలంలో లిక్కర్ బాటిళ్లతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బోల్తాపడింది. ఆల్విన్ ఫ్యాక్టరీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లు పగిలిపోయాయి. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన మద్యం బాటిళ్లను సర్దించి.. వేరే లారీలో అక్కడి నుంచి తరలించారు. ఈ ట్రక్కు కడప నుంచి లిక్కర్ లోడుతో రైల్వేకోడూరు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.