తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో.. అధికారులు కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద ప్రవాహానికి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.