కదిరి: ఏకాంతం కోసం అడవిలోకి వెళ్తే.. తెగిపడ్డ కరెంట్ తీగలు, జంటకు గాయాలు..

2 weeks ago 11
ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన జంటకు కరెంట్ షాక్ కొట్టిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటుచేసుకుంది. ఏకాంతంగా ఉండేందుకు యువతీయువకులు బత్తలపల్లి తండా సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి గాయపడ్డారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. యువతి స్వల్పంగా గాయపడ్డారు. వీరి కేకలు విన్న గొర్రెల కాపర్లు పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించారు.
Read Entire Article