30 ఏళ్ల తర్వాత ఓ బిడ్డ తన తల్లిని కలిసింది. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి పోలీసులకు చిక్కిన తల్లిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి కలుసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన వసంత అనే మావోయిస్టు అనారోగ్య కారణాలతో ఛత్తీస్గడ్ పోలీసులకు పట్టుబడగా.. ఆమె కుటుంబం గురించి ఆరా తీసిన కాంకేర్ పోలీసులు వరంగల్ జిల్లాలో ఉంటున్న కుమార్తెకు విషయం తెలియజేశారు. దీంతో ఆమె 30 ఏళ్ల తర్వాత కాంకేర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో తన తల్లిని కలుసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.